ATP: బెంగళూరులో ఐ కంప్లీట్ నాచురల్ సంస్థ నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల బాడీ బిల్డింగ్ పోటీలలో తాడిపత్రికి చెందిన సాయి మూడవ స్థానం సాధించారు. మొత్తం 143 మంది పాల్గొన్న ఈ పోటీలలో సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. సాయి విజయం పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మరింత రాణించాలని ఆకాంక్షించారు.