TPT: మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని మంత్రి పొంగూరు నారాయణకు ఆదివారం సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఇందులో భాగంగా గూడూరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన మంత్రిని సీఐటీయూ నాయకులు కలిశారు. మున్సిపల్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.