TPT: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “దండి మార్చ్ 2.0” పేరుతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, సూళ్లూరుపేట పరిధిలోని పాఠశాలలు, కళాశాలల నుంచి 7 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.