NLR: గుడ్లూరు తహసీల్దార్ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం ACB అధికారులు దాడి చేశారు. గుడ్లూరు-2 సచివాలయానికి చెందిన వీఆర్వో చలమారెడ్డి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. మాధవరెడ్డి అనే రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారుల దాడి చేశారు. అధికారుల విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.