TPT: వరదయ్య పాలెం మండలం బీఎస్ పేట గ్రామంలో దేవాంగుల కుల దేవత శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం పూజలో భక్తులు పాల్గొని భక్తిని చాటుకున్నారు. కాగా, గ్రామంలో 35 ఏండ్ల తర్వాత అట్టహాసంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి కొలువు జరుగుతుంది.