TPT: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించుకున్నారు.