SKLM: ప్రధాన మంత్రి బాలపురస్కార్ దరఖాస్తుల గడువు జులై 31వ తేదీ వరకు పెంచారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి బి. శాంతిశ్రీ తెలిపారు. సంస్కృతి, సామాజిక సేవ, విజ్ఞానం, సాంకేతికం, పర్యావరణం వంటి రంగాలలో అసాధారణ ప్రతిభ చూపిన 5 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే బాలలు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులన్నారు. బాలలు స్వయంగా లేదా వెబ్సైట్లో చేసుకోవాలి.