KRNL: కర్నూలు జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు సమీపంలో ప్రమాదవశాత్తు ఆటోను లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.