ప్రకాశం: మలేరియా మాసోత్సవంలో భాగంగా సోమవారం పొదిలి అర్బన్ పీహెచ్సీ ఆవరణలో రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. వర్షాకాలంలో వేగంగా వ్యాప్తి చెందే మలేరియాను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను దోమలు రాకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.