SKLM: ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ కూర్మ గ్రామంలో జూన్ 9న రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎటువంటి దురుద్దేశం లేదని, ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తుచేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటన శ్రీకాకుళంలో జారీ చేశారు. హిరమండలం పరిధిలో గల కూర్మలో పూజారులు దీపం వెలిగించిన తరువాత ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.