అన్నమయ్య: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నూతన స్కౌట్ యూనిట్లను ప్రారంభించేందుకు మార్చి 31 వరకు గడువు ఉందని జిల్లా సెక్రటరీ M. నరసింహారెడ్డి తెలిపారు. కొత్తగా చేరాలనుకునే పాఠశాలల ప్రతినిధులు ఈనెల 13న మధ్యాహ్నం 1 గంటకు రాయచోటిలోని డైట్ (DIET) నందు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలి. రూ.381 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని పొందవచ్చన్నారు.