కర్నూల్: జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు ఫీజుల పేర్లతో ఆర్థిక దోపిడీ చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న డీఎంహెచ్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్యకు ఫిర్యాదు చేశారు.