VZM: ఎండాకాలం కారణంగా పశుపక్షాదులకు దాహార్తిని తీర్చేందుకు మీ ఇంటి దగ్గర లేదా పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న మంచినీటి తొట్టెలను ఏర్పాటు చెయ్యాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ట్రెజరర్ షిణగం శివాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలో అనేక ప్రాంతాలలో పక్షులు నీళ్లు తాగేందుకు అవసరమైన సిమెంట్తో తయారు చేసిన మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేశారు.