NDL: పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శుక్రవారం నాడు పర్యటించారు. ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నాగలింగేశ్వరస్వామి ఆలయ పునః ప్రారంభ పనులకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.