సత్యసాయి: కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో ఎస్పీ సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. కేసుల పురోగతిని పర్యవేక్షించి, సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఆదేశించారు. కొత్త బీఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.