CTR: రామకుప్పం (M) పాల రేవు గడ్డ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ రాత్రికి పాల రేవు గడ్డ, చెల్లిని చేను, లక్ష్మీపురం, కుప్పం (M) కంగుంది వైపు వచ్చే అవకాశం ఉండడంతో అటవీ సరిహద్దు గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు.