W.G: ఆటో డ్రైవర్లకు అనంతపురం సభలో నారా చంద్రబాబునాయుడు వాహన మిత్ర పథకం ద్వారా దసరాకు సంవత్సరానికి 15వేలు ఇస్తానని ప్రకటించడంపై ఆకివీడు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.