E.G: కడియంలో ఉన్న శ్రీ విజయ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శ్రీ విజయ కనకమహాలక్ష్మి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం పీఠాధిపతులు శ్రీ పెమ్మిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు.