ప్రకాశం: మార్టూరు మండలంలో గురువారం విద్యుత్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 63 కేసులు నమోదు చేసి 3,18,000 అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. విద్యుత్ EE మస్తాన్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. మార్టూరు డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.సురేంద్ర బాబు, అద్దంకి డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.దామోదరరాజు తదితరులు పాల్గొన్నారు.