VZM: స్థానిక మ్యూజిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ – కం – సేల్స్ కు వినియోగదారుల నుండి విశేష స్పందన లభించిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మల జ్యోతి పేర్కొన్నారు. శుక్ర, శనివారాలలో 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రూ. 25,000 పైగా లబ్ధి పొందినట్లు ఆమె తెలిపారు. జీఎస్టీ చెల్లింపుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నమన్నారు.