కృష్ణా: విజయవాడలోని ఉత్సవ్ 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.