KMR: ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ పోటీలు మంగళవారం మండలంలోని మాచాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఆర్డీవో పార్థ సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపితే భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఉద్భోదించారు.