SRCL: కార్తీకమాసంలో మంగళవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఏఈవో శ్రవణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫోటోను ఆలయ అధికారులు అందించారు.