W.G: నల్లజర్ల మండలం దూబచర్లలో దొంగతనం జరిగింది. చీమకుర్తి భాస్కరరావు ఇంట్లోకి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు చొరబడి రూ.32 వేల నగదు, 40 గ్రాముల బంగారం దొంగిలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఏఎస్పీ సుబ్బరాజు, కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, సీఐ నక్క శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.