ప్రకాశం: కొండను తవ్వి గ్రావెల్ తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం వద్ద విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్వుతుండగా గ్రామస్తులు తమ భూములు ఉన్నాయంటూ అడ్డుకున్నారు. పశువుల మేతకు ఈ కొండ జీవనాధారం అని అన్నారు. ఎవరైనా కొండ ప్రాంతంలో గల మట్టిని తరలిస్తే సహించేది లేదని ధర్నా చేశారు.