E.G: నిడదవోలు నియోజకవర్గం పెండ్యాల గ్రామంలో మొంథా తుఫాన్ బాధితులను మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం కలిశారు. బాధితులకు 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు,1 కిలో బంగాళదుంపలు గ్రామంలోని 44 కుటుంబాలకు పంపిణీ చేసారు. నియోజకవర్గంలోని 23 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించడం జరిగిందని తెలిపారు. మొత్తం 312 కుటుంబాలకు అందజేసామన్నారు.