ప్రకాశం: ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 80 మందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి రికార్డులు లేని 4 ఆటోలు, 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన రికార్డులు చూపిన తర్వాత వాటిని యజమానులకు అప్పగించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కాలనీలో ర్యాలీ చేపట్టారు.