TPT: పుత్తూరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని ఇది కార్పొరేటర్ బడ్జెట్ అన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఏమాత్రం ఉపయోగపడేలా లేదని ఆయన డిమాండ్ చేశారు.