E.G: వై.రామవరం మండలం కేంద్రంలోని గిరిజన గ్రామాల్లో రహదారి సదుపాయం కల్పించాలని కోరుతూ ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చి రెడ్డి సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రవాణా సౌకర్యం లేక డోలీల మీద ఆధారపడుతు గ్రామస్థులు నిత్యవసరాలు, వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్పందించకపోతే దీక్షను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.