NLR: బద్దెవోలులోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న మహా గణపతికి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో మహాగణపతికి పంచామృతాభిషేకం చేసి, నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గణపతి ఆశీస్సులు పొందారు.