CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కాగా, స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు.