చిత్తూరు: బి. కొత్తకోట పట్టణానికి చెందిన టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కో-కన్వీనర్ కుడుము శ్రీనివాసులు సోదరుడు ఉదయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయ్ కుమార్ మృతికి పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు సంతాపం తెలియజేసారు. ఉదయ్ కుమార్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటన్నారు.