GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న కొక్కిరగడ్డ కృష్ణమోహన్ గౌరవ డాక్టరేట్ను సోమవారం అందుకున్నారు. సైకాలజీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బెంగళూరులోని భారత్ వర్చువల్ విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్ను ప్రదానం చేసింది. కృష్ణమోహన్ను ఏఎన్యూ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.