SKLM: కొణిదెల పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసైనికులు మందస గ్రామదేవత శ్రీ అన్నపూర్ణమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.