మన్యం: గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్లో ప్రవేశాలకు సీట్లు పెంచాలని గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ అధికారులను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 1,239 మంది ఇంటర్మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీంతో 639 మందికి సీట్లు లభించని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సీట్లు పెంచి విద్యార్థులకు న్యాయం చెయ్యాలన్నారు.