SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు సాయి నగర్లో మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీధుల్లో రహదారులు గోతులు మయంగా మారాయని పలువురు స్థానికులు కమిషనర్కు వివరించారు. వర్షాలు కురిస్తే ఆ గోతుల్లో నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతోందని వాపోయారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు.