ఎన్టీఆర్: విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకు వాహనాలు రోడ్డుపైనే బారులు తీరాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.