SRCL: తంగళ్ళపల్లి(M) టెక్స్ టైల్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వివరాల్లో కెళితే.. గ్రామానికి చెందిన నిమ్మల మహేశ్ అనే వ్యక్తి 9 నెలల క్రితం వ్యాను కొన్నాడు. ఈ క్రమంలో EMIలు కట్టలేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే డీసీఎంకు నిప్పు పెట్టాడని ఎస్సై రామ్మోహన్ తెలిపారు. గ్రామ కారొబార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.