ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అయితే, ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఆతిథ్య పాకిస్థాన్ నుంచి ఏ ప్రతినిధి లేకపోవడంపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. పీసీబీ తీరుపై విమర్శలు గుప్పించాడు. ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్కు చెందిన ఒక్క ప్రతినిధి లేకపోవడం బాధగా ఉందన్నాడు. ఎందుకు పీసీబీ ప్రతినిధిని పంపించలేదని ప్రశ్నించాడు.