KMR: దోమకొండ ఫోర్ట్ &విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంపొందించడంపై ట్రస్ట్ ప్రతినిధులు దృష్టి సారించారు. గణేష్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యం సమాజ భవిష్యత్తుకు ముఖ్యమని అన్నారు.