E.G: బీసీ సోదరుల హక్కుల పరిరక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సిద్ధపడ్డారని పార్టీ గోపాలపురం కన్వీనర్ నాచుకు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీక్షకు మద్దతు పలకాలని కోరుతూ ఇవాళ గోపాలపురంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.