KMM: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి క్రమం రద్దు చేసినట్లు వివరించారు.