సత్యసాయి: లేపాక్షి మండలం చోళ సముద్రం టోల్గేట్ వద్ద రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలను పరిశీలించి పత్రాలు చెక్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.