GDWL: గట్టు మండలం మాచర్ల గ్రామంలో ఆదివారం మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సందర్శించి పర్యవేక్షించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వజ్రమ్మ, పంచాయతీ కార్యదర్శి మునినాయక్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.