AKP: రాంబిల్లి మండలం సీతంపాలెంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.