మెదక్ పట్టణంలో శ్రీ కోదండ రామాలయం రథోత్సవం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో రథోత్సవంతో ముగిశాయి. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ముందుకు రథాన్ని ముందుకు లాగారు. ఆలయం ముందు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథం లాగారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామ నినాదాలు చేశారు.