పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రహదారుల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.