PDPL: ధర్మారం మండలం నల్లలింగయ్యపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఇద్దరు కాంప్లెక్స్ స్థాయిలో ఎంపికై, అనంతరం ఇంగ్లీష్ విభాగంలో జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ విజయాన్ని అభినందిస్తూ ఎంఈవో పాఠశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీర్పాల్, ఉపాధ్యాయుడు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.