NLG: చింతపల్లి మండలం మోద్గుల మల్లేపల్లిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బ్యాట్ పట్టి శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్ ఉన్నారు.