AP: తెలంగాణ మాజీ సీఎం KCRపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. KCR, KTR ఏపీలో అడుగుపెడితే తరిమేస్తామని హెచ్చరించారు. BRS పేరుతో రావాలని చూస్తే అడుగుపెట్టనివ్వమని తెలిపారు. కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలను ఓసీల్లో చేర్చి KCR పెద్ద తప్పు చేశారని విమర్శించారు. అందుకే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఓడించారని చెప్పారు.